ఏప్రిల్‌ మూడోవారంలో 55 వేలకు ఖాళీలకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ?
ఉపఎన్నిక తర్వాత భర్తీ!
ఏప్రిల్‌ మూడోవారంలో ఉద్యోగాల నోటిఫికేషన్‌?
ఖాళీలు 55 వేలకు పైనే..
తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. ఖాళీల లెక్క తేలడంతో ప్రభుత్వం నియామకాల ప్రక్రియను చేపట్టనుంది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ముగిసిన తర్వాత వచ్చే నెల మూడోవారంలో మొదటి నోటిఫికేషన్‌ వెలువడే వీలుంది. అన్ని శాఖల నుంచి తెప్పించిన ఖాళీల జాబితాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదివారం సీఎం కేసీఆర్‌కు సమర్పించారు. మొత్తం ఖాళీలు 55 వేల కంటే ఎక్కువే ఉన్నట్లు సమాచారం. గతంలో 50 వేలుగా అంచనా వేయగా, తాజాగా పదోన్నతుల అనంతరం మరో అయిదువేల పోస్టులు తేలాయి. ఉపాధ్యాయ పదోన్నతులు చేపడితే ఖాళీలు మరో అయిదువేలకు పైగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన గణాంకాల మేరకు పోలీసుశాఖలో అత్యధికంగా, ఆ తర్వాత విద్య, వైద్యఆరోగ్య శాఖల్లో అధిక పోస్టులున్నాయి. రెవెన్యూ, పురపాలక, వ్యవసాయ, నీటిపారుదల శాఖల్లోనూ గణనీయంగానే లెక్క తేలాయి. ఒకటి, రెండు రోజుల్లో సీఎం సమీక్ష
ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్‌ ఒకటి, రెండు రోజుల్లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఖాళీలు, వాటి భర్తీ ప్రక్రియ, నియామక సంస్థల ఎంపిక వంటి అంశాలపై విధాన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ నియామకాలపై మంత్రిమండలి ఆమోదం పొంది, ఆయా శాఖలను సన్నద్ధం చేయాల్సి ఉంది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక వచ్చే నెల 17న జరగనుంది. ఎన్నికల నియమావళి ముగిసిన తర్వాతే నియామక ప్రక్రియ చేపట్టే వీలుంది
Previous Post Next Post