ఏపీలో ఈనెల 25న భారీ జాబ్‌మేళా.. హాజరుకానున్న 6 కంపెనీలు
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆధార్‌ కార్డు, రెజ్యూమేతో ఈ నెల 25వ తేదీన ఉదయం పది గంటలకు హాజరుకావచ్చు. ఈ జాబ్‌మేళాలో 6 ప్రముఖ కంపెనీలు పాల్గొనున్నాయి

ఏపీలో ఈనెల 25న భారీ జాబ్‌మేళా.. హాజరుకానున్న 6 కంపెనీలు

ప్రధానాంశాలు:
  • ఏపీలో ఉద్యోగావకాశాలుఆగస్టు 25న జాబ్‌మేళా నిర్వహణ ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్‌. 
  • ఈనెల 25వ తేదీన గుంటూరులో భారీ జాబ్‌మేళాను నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ జాబ్‌మేళా జరగనుంది. ఈ జాబ్‌మేళాలో 6 ప్రముఖ కంపెనీలు పాల్గొనున్నాయని జిల్లా ఉపాధి అధికారి డి.దుర్గా బాయి ప్రకటనలో తెలిపారు.


ఎస్‌ఎస్‌సీ/ఇంటర్/డిగ్రీ, ఐటీఐ (ఫిట్టర్‌, ఎలక్ట్రికల్‌, మెనాకిల్‌), /బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్‌సీ/ఎంఎస్సీ, కెమిస్ట్రీ/మైక్రోబయాలజీ, జీఎన్‌ఎమ్‌/బీఎస్‌సీ (నర్సింగ్‌), బీటెక్‌/డిప్లొమా (మెకానికల్‌), ఎమ్‌బీఏ, బీకామ్‌ (కంప్యూటర్స్‌) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ జాబ్‌మేళాకు హాజరుకావొచ్చు.

ఈ జాబ్‌మేళాలో పాల్గొనాలనుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆధార్‌ కార్డు, రెజ్యూమేతో ఈ నెల 25వ తేదీన ఉదయం పది గంటలకు గుంటూరులోని జిల్లా ఉపాధి  కార్యాలయ ప్రాంగణం, గుజ్జనగుండ్లలో హాజరుకావాల్సి ఉంటుంది

పూర్తి వివరాల కోసం https://www.ncs.gov.in/ వెబ్‌పోర్టల్‌లో ఆన్‌లైన్‌ జాబ్‌ సీకర్‌గా రిజిస్టర్‌ చేసుకోవాలి. ఒకవేళ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోకపోతే నేరుగా ఆధార్‌తో పాటు విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరుకావొచ్చని అధికారులు వెల్లడించార

Previous Post Next Post