ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
పీ,ఎల్‌, ఎఫ్‌ రకం మందులకు అనుమతి
కంట్లో చుక్కల మందుకు దక్కని పర్మిషన్‌
సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ఆధారంగా ప్రభుత్వ నిర్ణయం

ఎట్టకేలకు ఆనందయ్య మందుకు అడ్డంకులు తొలగిపోయాయి. కరోనా రోగులకు ఆనందయ్య మందు ఇవ్వవచ్చంటూ ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అనుమతి
ఆనందయ్య ఇ‍చ్చే పీ, ఎల్‌, ఎఫ్‌ మందులను రోగులు వాడేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే కంట్లో వేసే ‘కే’ రకం మందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కే మందుకు సంబంధించి విచారణ రిపోర్టు రానందున, ప్రస్తుతం ఈ మందుకు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. కంట్లో వేసే చుక్కల మందుకు సంబంధించి నివేదిక రావడానికి మరో రెండు నుంచి మూడు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ నివేదిక పరీశీలించిన అనంతరం కే రకం మందుపై నిర్ణయం తీసుకోనున్నారు. వ్యక్తిగత విచక్షణ
కరోనాకు డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూనే.. వ్యక్తిగత విచక్షణ మేరకు ఆనందయ్య మందును వాడుకునేందుకు ప్రభుత్వం పర్మిషన్‌ ఇచ్చింది. ఆనందయ్య మందులు వాడుతున్నామనే కారణంతో మిగిలిన మందులు ఆపవద్దంటూ ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే అనందయ్య మందు వాడితే కరోనా తగ్గుతుందనేందుకు కచ్చితమైన ఆధారాలు ఏవీ లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆనందయ్య మందుల వల్ల హాని కూడా లేదని తేలింది. రోగులు రావొద్దు
ఆనందయ్య మందును తీసుకునేందుకు కొవిడ్‌ రోగులు కృష్ణపట్నం రావొద్దని ప్రభుత్వం సూచించింది. రోగుల బదులు వారి కుటుంబ సభ్యులు వచ్చి మందును తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేసింది. ఇలా చేయడం వల్ల కరోనా వ్యాప్తిని నివారించవచ్చని సూచించింది. ఆనందయ్య మందు పంపిణీలో కోవిడ్‌ ప్రోటోకాల్‌ పాటించాలంటూ ఆదేశించింది

హైకోర్టులో విచారణ
అంత‌క‌ముందు ఆయుర్వేద మందును ప్ర‌భుత్వ‌మే పంపిణీ చేయాలంటూ ఆనంద‌య్యతో పాటు మరో ఇద్దరు వేసిన పిటిష‌న్‌పై హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఔష‌ధంపై రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యం తెల‌పాల‌ని ప్ర‌భుత్వం త‌ర‌ఫు న్యాయ‌వాదిని కోర్టు కోరింది. ఈ విష‌యంపై ఈరోజు ప్ర‌భుత్వం స‌మీక్ష జ‌రుపుతుంద‌ని న్యాయ‌వాది వివ‌రించారు. చ‌ట్ట‌ ప్ర‌కారం ఆనంద‌య్య మందు పంపిణీకి ప్ర‌భుత్వం అనుమ‌తి అవ‌స‌రం లేద‌ని ఆనంద‌య్య త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టులో వాదించారు. వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం విచార‌ణ‌ను మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వాయిదా వేసింది. ఈలోపు ఆనంద‌య్య మందుకు అనుమ‌తిచ్చిన నేప‌థ్యంలో ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం అధికారికంగా హైకోర్టుకు తెలిపే అవకాశముంద

Previous Post Next Post