Highlights of Education Minister Webex Meeting with Unions on 25th May.

ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఉపాధ్యాయ సంఘాలతో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ గారు వెబెక్స్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్ గారు, కమిషనర్ శ్రీ వి. చిన వీరభద్రుడు గారు, ఎస్ పి డి శ్రీమతి వెట్రిసెల్వి గారు మరియు ఇతర ఉన్నతాధికారులతో పాటుగా గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నాయి.
ఈ సమావేశంలో విద్యారంగంలో కొనసాగుతున్న సమస్యలను ప్రస్తావించటం జరిగింది ముఖ్యంగా :
  • ప్రస్తుత పరిస్థితులలో పరీక్షలను వాయిదా వేయాలనీ, పాఠశాలల పునఃప్రారంభం ను కూడా వాయిదా వేయాలని కోరడమైనది.
  • నాడు నేడు లో పాల్గొన్న ఉపాధ్యాయులకు ఇంతవరకు ఆర్థిక సెలవులను మంజూరు చేయలేదని కోరగా కమిషనర్ గారు ఒక వారం రోజులలోనే ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు.
  • ఉపాధ్యాయులందరినీ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి అందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి అయిన తరువాత మాత్రమే పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని కోరడమైనది.
  • కోవిడ్ తో మరణించిన ఉపాధ్యాయులకు వెంటనే ఎక్స్ గ్రే షియా చెల్లించాలనీ, వారి యొక్క పెన్షన్ తదితర సదుపాయాలను వెంటనే అందజేయాలనీ, మరియు వారి కుటుంబంలోని వారికి వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలనీ కోరడమైనది.
  • కోవిడ్ బారిన పడిన ఉపాధ్యాయులకు ప్రత్యేక సెలవులు మంజూరు కోరడమైనది.
  • విద్యాబోధనకు ఆటంకపరిచే యాప్ ల భారంను తగ్గించాలనీ కోరగా, పాఠశాలల పునః ప్రారంభం నాటికి కనెక్టివిటీని పెంచి దీనిలో ఉన్న ఇబ్బందులను పూర్తిగా తొలగిస్తామని హామీ ఇవ్వడమైనది.
  • నాడు నేడు రెండో విడత లో భాగంగా ఉపాధ్యాయులకు భారం తగ్గించాలని కోరగా, సచివాలయ సిబ్బంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో పని భారాన్ని పంచుతామని తెలిపారు.
  • సర్వీస్ రూల్స్ కు శాశ్వత పరిష్కారం త్వరితగతిన తీసుకురావాలని... జె ఎల్ ప్రమోషన్ లను చేపట్టాలనీ..శాశ్వత బదిలీ కోడ్ అమలు చేయాలనీ..వెంటనే డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలనీ కోరగా, డీఎస్సీ నిర్వహించి 8600 ఏకోపాధ్యాయ పాఠశాలలకు ఉపాధ్యాయులను అందిస్తామని తెలిపారు.
  • ఎయిడెడ్ పాఠశాలల విలీన ప్రక్రియలను వెంటనే చేపట్టాలని కోరడమైనది.
  • ఇటీవల జరిగిన బదిలీలలో కోర్టు కేసుల కారణంగా బదిలీలు పొందని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలనీ కోరగా, జూన్ 15 నుండి 30 వరకు వారికి కౌన్సిలింగ్ నిర్వహించమని తెలిపి ఉన్నారు కావున ఆ కార్యాచరణను చేపడతామని తెలిపారు.
  • పాఠశాలల పునర్విభజనలో భాగంగా బదిలీ పొందిన ఉపాధ్యాయులకు నాన్ హెచ్ ఆర్ ఎం ఎస్ ద్వారానే జీతాలు చెల్లిస్తున్నారనీ, వెంటనే వారికి పొజిషన్ ఐ డి లు వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరడమైనది.
  • 40 మంది విద్యార్థుల సంఖ్య దాటిన ప్రాధమిక పాఠశాలలకు హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలనీ, అంతర్ జిల్లా బదిలీలు, అంతరాష్ట్ర బదిలీలు చేపట్టాలనీ, నెల వారి పదోన్నతులు చేపట్టాలని, 610 జీవో ద్వారా కొనసాగుతున్న ఉపాధ్యాయులకు బదిలీలు మరియు పదోన్నతులలో అవకాశం కల్పించాలని కోరడమైనది.
  • ఇంకనూ పలురకాల విద్యారంగ, పాఠశాలల సమస్యలను మంత్రివర్యులు మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వాటన్నిటిపై సానుకూలంగా స్పందించి త్వరలో నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి వర్యులు మరియు అధికారులు తెలపడమైనది.
Some Imp Points:
1. వివిధ రకాల యాప్ లను పరిశీలించి తగ్గిస్తామని హామీ
2. నాడు నేడు ప్రధానోపాధ్యాయులకు త్వరలో E L. (ఒక వారంలో) మంజూరు చేస్తానని హామీ
3 సర్వీసు రూల్స్ అతి త్వరలో సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ.
Previous Post Next Post