ఆనందయ్య మందు మంచిదే - మందుతో ఎలాంటి ప్రమాదం లేదు: ఆయుష్‌ . ఆనందయ్య మందుతో ఎలాంటి ప్రమాదం లేదు: ఆయుష్‌
సీఎం జగన్ కు నివేదిక సమర్పించిన ఆయుష్‌ కమిషన్‌
పూర్తి నివేదిక వచ్చాక పంపిణీ పై నిర్ణయం

ఆనందయ్య మందు మంచిదే - మందుతో ఎలాంటి ప్రమాదం లేదు: ఆయుష్‌

కరోనా కట్టడి కోసం ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందుపై ఆయుష్‌ పరిశోన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయుష్‌ కమిషనర్‌ రాములు ఆనందయ్య మందుపై నివేదికను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. ‘‘ఆనందయ్య మందు ద్వారా ఎలాంటి ప్రమాదం లేదు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ప్రజలకు పంపిణీ చేయవచ్చు. మూడు, నాలుగు రోజుల తర్వాత నివేదక వస్తుంది. సీసీఆర్‌ఏఎస్‌ నివేదక వచ్చిన తర్వాత మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది’’ అని తెలిపారు.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఔషధంలో హానికారమైన పదార్థాలేవీ లేవని ఆయుష్‌ విభాగం స్పష్టం చేసింది. ఔషధం కోసం మొత్తం 18 మూలికలు వాడినట్లు తెలిపింది. వాటిపై పూర్తిగా చర్చించామని, వివరాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి తెలిపామని ఆయుష్‌ కమిషనర్‌ రాములు మీడియాకు వెల్లడించారు. మరో నాలుగైదు రోజుల్లో పూర్తి నివేదిక వస్తుందన్నారు. ఆ మందుతో లబ్ధి జరిగిందని ఎక్కువ మంది చెబుతున్నారని ఆయన అన్నారు. ‘‘70 నుండి 80 వేల మందికి పైగా ఇప్పటి వరకు మందులు ఇచ్చామని నిర్వాహకులు చెబుతున్నారు. ఎక్కువ మంది మందు తీసుకోవడం వల్ల ఒకరిద్దరిలో ఇబ్బందులు ఉండొచ్చు. మందులో వాడే పదార్ధాలన్నీ ఆయుర్వేదం అంగీకరించినవే. కానీ, ఆయుర్వేద ముందుగా గుర్తించాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ పుస్తకాల్లో లేని మందు ఏదైనా క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించాల్సి ఉంటుంది. ఏ మోతాదులో ఆ పదార్ధాలు వాడుతున్నారనేది కూడా ముఖ్యమే.ఆయుర్వేదిక్ మెడిసిన్ అని పిలిచేదానికి అవకాశం లేదు. ఈ ఔషధాన్ని కోవిడ్‌కు మందుగా పరిగణించలేం. ‘నాటు మందు’ అని అవమానించే అవసరం లేదు. ఆ మందు వల్ల ఉపయోగం ఉంది’’ అని రాములు వివరించారు.
వైద్య పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్నది తమకు తెలియదని, దీనిపై కంటి వైద్య నిపుణుల సలహాలు కూడా తీసుకుంటామని రాములు అన్నారు. కంట్లో వేసే చుక్కలపై కొన్ని అనుమానాలు ఉన్నాయని, అవి తొలగిపోయిన తర్వాత దానిపైనా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘‘ కళ్లలో వేసే మందులో మూడు పదార్ధాలు వేస్తున్నారు. ఆయుర్వేదాన్ని బట్టి ఆ మూడింటి వల్లా నష్టం లేదు. నాణ్యత లాంటి అంశాలు పరిశీలించాల్సి ఉంది. గామస్థులను విచారించిన తర్వాత ఆ ప్రాంతంలో కరోనా కేసులు తక్కువ ఉన్నాయని తెలిసింది. కరోనా మరణాలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. పూర్తి వివరాలను సీఎంకు వివరించాము. మరో నాలుగైదు రోజుల్లో పూర్తి నివేదిక అందిస్తాం’’ అని రాములు చెప్పారు

Previous Post Next Post